అరటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2021-04-24T04:26:53+05:30 IST
అకాల గాలీ వాన కారణంగా నష్టపోయిన అరటి రైతులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వేముల, ఏప్రిల్ 23: అకాల గాలీ వాన కారణంగా నష్టపోయిన అరటి రైతులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఆయన సందర్శిం చారు. జిల్లాలో వీచిన గాలులకు చేతికి వచ్చిన పంట నేలరాలడంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే నష్టపోయిన రైతులతో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పులివెందుల పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.