ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-07-27T06:35:31+05:30 IST
ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారు. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు.
సూర్యాపేట క్రైం, జూలై 26 : ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారు. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.