నకిలీ సర్టిఫికెట్లపై రిమ్స్ డైరెక్టర్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-11-27T05:13:31+05:30 IST
సాంగిడి గ్రామంతో పాటు జి ల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో పింఛన్లు పొందేందుకు నకిలీ స ర్టిఫికెట్లు తీసుకొస్తున్నారని గురువారం కాంగ్రెస్ నాయకులు రిమ్స్ డైరెక్టర్ బలిరాంబానోత్ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్టౌన్, నవంబరు26 : సాంగిడి గ్రామంతో పాటు జి ల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో పింఛన్లు పొందేందుకు నకిలీ స ర్టిఫికెట్లు తీసుకొస్తున్నారని గురువారం కాంగ్రెస్ నాయకులు రిమ్స్ డైరెక్టర్ బలిరాంబానోత్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రిమ్స్లోని కొందరు వైద్యులు నకిలీ రఽధువపత్రా లు కలిగిన వారికి సహకరిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఇప్పటికే కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకంలో అవినీతికి పాల్పడిన విషయం అందకీ తెలిసిందేనన్నారు. ఇందుకు స్పందించిన రిమ్స్ డైరెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సామరూపెష్రెడ్డి, బోక్రెశంకర్ పాల్గొన్నారు.