పోలీసుల పేరుతో ఫోన్ చేసి బెదిరిస్తున్నారు
ABN , First Publish Date - 2021-03-01T07:04:12+05:30 IST
పోలీసుల పేరుతో ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ ఓ మహిళ మంత్రి కేటీఆర్, నగర పోలీస్ కమిషనర్కు ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
మంత్రి కేటీఆర్, సీపీకి ట్విటర్ ద్వారా మహిళ ఫిర్యాదు
బంజారాహిల్స్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పోలీసుల పేరుతో ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ ఓ మహిళ మంత్రి కేటీఆర్, నగర పోలీస్ కమిషనర్కు ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ ఫోన్ నెంబరు నుంచి తనకు ఫోన్ చేసి రోడ్డు నెంబరు 3 ఎస్ఐని మాట్లాడుతున్నాను, నాటకాలు ఆడుతున్నావా అంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు ఎస్ఐలు ఎవరూ బెదిరించలేదని స్పష్టం చేశారు. ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.