రియల్టర్‌పై ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-10-25T11:00:38+05:30 IST

పామూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న నక్కల వెంకటేశ్వర్లుపై కీర్తిపాటి తిరుపతమ్మ అనే మహిళ సీఐ కొండవీటి శ్రీని వాసరావుకు ..

రియల్టర్‌పై ఫిర్యాదు

పామూరు, అక్టోబరు 24: పామూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న నక్కల వెంకటేశ్వర్లుపై కీర్తిపాటి తిరుపతమ్మ అనే మహిళ సీఐ కొండవీటి శ్రీని వాసరావుకు శనివారం ఫిర్యాదు చేసింది. పామూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 246లో  రెండేళ్ల క్రితం తనకు ప్లాట్‌ అమ్మాడని, అందుకు సంబంధించి కనిగిరి సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీస్‌లో తన పేరున రిజిస్టర్‌ చేశారని తెలిపింది. అప్పటి నుంచి ప్లాటును చూపించకపోగా, అడిగితే బూతులు తిడుతున్నాడని, అతనిని చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది. 

Updated Date - 2020-10-25T11:00:38+05:30 IST