కుల బహిష్కరణ చేశారని పోలీ్సస్టేషనలో ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-07-01T06:43:16+05:30 IST
తమను కుల బహిష్కరణ చేశారని బాధితులు స్థానిక పోలీ్సస్టేషనలో గురువారం ఫిర్యాదు చేశారు.
భూదానపోచంపల్లి, జూన 30: తమను కుల బహిష్కరణ చేశారని బాధితులు స్థానిక పోలీ్సస్టేషనలో గురువారం ఫిర్యాదు చేశారు. బాధితులు చెక్క పెంటయ్య, చెక్క నరసింహ, చెక్క జంగయ్య, చెక్క పాండు, మోర విష్ణు, పుప్పాల ముత్యాలు, చింతల లక్ష్మమ్మలు మాట్లాడుతూ ముదిరాజ్ కులానికి చెందిన చెక్క చంద్రయ్య మృతిచెందగా తాము అంత్యక్రియలకు వెళ్లామని, తమను కులం నుంచి బహిష్కరించినట్లు కుల సంఘానికి చెందిన నేతలు వివక్షకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ కులం లో మూడు సంవత్సరాలుగా ఎలాంటి కార్యక్రమాలకు రాకుండా సమాచారం ఇవ్వకుండా కుల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కుల సంఘాల నేతలు చెక్క గణేష్, వనం వెంకటయ్య, చెక్క రమేష్, జినుకల బస్వయ్య తమపై వివక్ష చూపుతున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సైదిరెడ్డికి ఫిర్యాదు చేశారు.