చక్కెర ఫ్యాక్టరీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-07-08T04:03:46+05:30 IST
కోవూరు సహకార చక్కెర కర్మాగార స్థలాన్ని పలువురు రైతులు ఆక్రమించినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. ఫ్యాక్టరీ ఇన్ చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ గురువారం ఫ్యాక్టరీ ఆవరణను పరిశీలించారు.
కోవూరు, జూలై 7: కోవూరు సహకార చక్కెర కర్మాగార స్థలాన్ని పలువురు రైతులు ఆక్రమించినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. ఫ్యాక్టరీ ఇన్ చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ గురువారం ఫ్యాక్టరీ ఆవరణను పరిశీలించారు. ఫ్యాక్టరీ స్థలాన్ని రైతులు తమ పొలంలో కలుపుకోవడాన్ని పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి ఫ్యాక్టరీ స్థల ఆక్రమణల్ని తొలగించాలన్నారు. ఫ్యాక్టరీ స్థలాన్ని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమించబోమని రైతులు హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైనట్లు భావిస్తున్నారు.