పొలం రోడ్డును ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-06-28T06:43:48+05:30 IST

పుల్లలచెరువు గ్రామం నుంచి పొలాలకు వెళ్లే రోడ్డును కొంత మంది ఆక్రమించారని పుల్లలచెరువు ఎంపీటీసీ సభ్యుడు మేడికొండ రాథాకృష్ణ సోమవారం స్పందనలో తహాసీల్దార్‌ కే.దాసుకు ఫిర్యాదు చేశారు.

పొలం రోడ్డును ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు
తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న రైతులు

పుల్లలచెరువు, జూన్‌ 27: పుల్లలచెరువు గ్రామం నుంచి పొలాలకు వెళ్లే రోడ్డును కొంత మంది ఆక్రమించారని పుల్లలచెరువు ఎంపీటీసీ సభ్యుడు మేడికొండ రాథాకృష్ణ సోమవారం స్పందనలో తహాసీల్దార్‌ కే.దాసుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు రాథాకృష్ణ మాట్లాడుతూ 60 లింకుల రోడ్డును పూర్తిగా అక్రమించుకోవడంతో కనీసం ట్రాక్టరు వెళ్లడానికి కూడా వీలులేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే హద్దులు చూపి రోడ్డు అక్రమణలను తొలగించాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-28T06:43:48+05:30 IST