రెవెన్యూ అధికారులపై ఆర్డీవోకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-03T05:54:33+05:30 IST

కల్హేర్‌, డిసెంబరు 2 : కల్హేర్‌ తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిపై చర్యలు తీసుకుని విధులకు సక్రమంగా హాజరయ్యేలా చూడాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అల్లాపురం రాజు, ఇతర నాయకులు ఖేడ్‌ ఆర్డీవోకు బుధవారం ఫిర్యాదు చేశారు.

రెవెన్యూ అధికారులపై ఆర్డీవోకు ఫిర్యాదు
అధికారులు రాకపోవడంతో కల్హేర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

కల్హేర్‌, డిసెంబరు 2 : కల్హేర్‌ తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిపై చర్యలు తీసుకుని విధులకు సక్రమంగా హాజరయ్యేలా చూడాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అల్లాపురం రాజు, ఇతర నాయకులు ఖేడ్‌ ఆర్డీవోకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసీల్దార్‌తో పాటు సిబ్బంది అందరూ మధ్యాహ్నం 12 గంటల తర్వాతనే విధులకు హాజరవుతున్నారని చెప్పారు. ప్రస్తుతం భూముల రిజిస్ర్టేషన్లు తహసీల్దార్‌ కార్యాలయంలోనే నిర్వహిస్తుండగా.. సిబ్బంది ఆలస్యంగా వస్తుండడంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీల ఫొటోలను ఉన్నతాధికారులకు పంపించారు. 

Updated Date - 2020-12-03T05:54:33+05:30 IST