హోం మంత్రి మహమూద్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-03-15T00:33:13+05:30 IST
హోం మంత్రి మహమూద్ అలీ పై ఎన్నికల అధికారులకు ఓయూ
హైదరాబాద్: హోం మంత్రి మహమూద్ అలీ పై ఎన్నికల అధికారులకు ఓయూ జేఏసీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలను హోం మంత్రి ఉల్లంఘించారని ఓయూ జేఏసీ నేత జటంగి సురేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. గోప్యత పాటించే ఓటు హక్కును హోం మంత్రి మహమూద్ అలీ బహిర్గతం చేసి ఎమ్మెల్సీ ఎన్నికలలో నిబంధనలను ఉల్లంఘించారని వారు పేర్కొన్నారు. తన ఓటును ఎవరికి వేశాననే విషయాన్ని బహిర్గతం చేసిన హోం మంత్రి మహమూద్ పై విచారణ చేయాలని కోరారు. హోం మంత్రి ఓటుని డిస్ క్వాలిఫై చేయాలని సురేష్ యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.