కోడ్‌ను ఉల్లంఘించారని మంత్రులపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-09T08:50:07+05:30 IST

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రులు, పలువురు నేతలు నియమావళిని ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) శశాంక్‌ గోయెల్‌కు..

కోడ్‌ను ఉల్లంఘించారని మంత్రులపై ఫిర్యాదు

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రులు, పలువురు నేతలు నియమావళిని ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) శశాంక్‌ గోయెల్‌కు.. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎం.శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్‌, పి.రాజేశ్‌ కుమార్‌ సోమవారం ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణీదేవిలకు మద్దతుగా చేస్తున్న హామీలు, ప్రకటనలను ఉదహరించారు. బ్రాహ్మణులు, జర్నలిస్టులు, రేషన్‌ డీలర్ల సంఘాలు, గజిటెడ్‌ ఆఫీసర్స్‌తో సమావేశాలను ప్రస్తావించారు. 

Updated Date - 2021-03-09T08:50:07+05:30 IST