వలంటీరుపై ఎంపీడీఓకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-05-07T04:54:20+05:30 IST

విద్యార్థులను వలంటీర్లుగా ఎలానియమిస్తారని ప్రశ్నిస్తూ గంగనపల్లె వలంటీరుపై ఎంపీడీఓ ముజఫర్‌ రహీంకు ఫిర్యాదు చేశారు.

వలంటీరుపై ఎంపీడీఓకు ఫిర్యాదు

కాశినాయన మే 6: విద్యార్థులను వలంటీర్లుగా ఎలానియమిస్తారని ప్రశ్నిస్తూ గంగనపల్లె వలంటీరుపై ఎంపీడీఓ ముజఫర్‌ రహీంకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందడంలేదని పలువురు గ్రామస్తులు ఎంపీడీఓను కలిసి పూర్తివివ రాలతో కూడిన అర్జీని ఆయనకు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ

నీరుగంటి రిహానా అనే వలంటీరు పోరుమామిళ్ళలోని ఓప్రైవేట్‌ కాలేజీలో రెగ్యులర్‌గా డిగ్రీ చదువుతోందన్నారు. ఇలాంటి వారు ప్రజలకు ఎలా సత్వర సేవలు అందిస్తారని ప్రశ్నించారు. ఈవియంపై ఎంపీడీఓను వివరణ కోరగా ఫిర్యాదు చేసినమాట వాస్తవమేనని విచారించి రెగ్యులర్‌గా డిగ్రీ చదువుతున్నట్లు నిరూపి తమైతే తగు చర్యలు తీసుకుంటామన్నారు.


Updated Date - 2021-05-07T04:54:20+05:30 IST