వీఆర్‌ఓపై తహసీల్దార్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-05-20T04:55:46+05:30 IST

గుర్రప్పగారిపల్లె వీఆర్‌ఓ చరణ్‌పై కొత్తవడ్డెపల్లెలో ఇరువర్గాలు తహసీల్దార్‌ తులసమ్మకు ఫిర్యాదులు చేశారు. ఇద్దరు వలంటీర్లను అడ్డం పెట్టుకుని వీఆర్‌ఓ లంచం తీసుకుని పనులు చేయడం లేదని టీడీపీ నేతలతో ఫిర్యాదు చేశారు.

వీఆర్‌ఓపై తహసీల్దార్‌కు ఫిర్యాదు
వీఆర్‌ఓపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు

వీరబల్లి, మే19: గుర్రప్పగారిపల్లె వీఆర్‌ఓ చరణ్‌పై కొత్తవడ్డెపల్లెలో ఇరువర్గాలు తహసీల్దార్‌ తులసమ్మకు ఫిర్యాదులు చేశారు. ఇద్దరు వలంటీర్లను అడ్డం పెట్టుకుని వీఆర్‌ఓ లంచం తీసుకుని పనులు చేయడం లేదని టీడీపీ నేతలతో ఫిర్యాదు చేశారు. కాగా అందరి రెవెన్యూ సమస్యలు సకాలంలో తీరుస్తున్న వీఆర్‌ఓపై అభాండాలు వేస్తున్నారని మరో వర్గం ఖండించింది. సంతకాలు లేకుండా ఇంటి పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా ఇరువురు ఫిర్యాదులు చేశారని విచారించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తానన్నా రు. కొత్తవడ్డెపల్లెలో ఇద్దరు ఘర్షణ పడి పునాదిని నిలిపినందుకు తమపై ఇలా అభాండాలు వేస్తున్నారని వీఆర్వో అన్నారు. జనాలను విచారిస్తే తాను లంచం తీసుకున్నానో లేదో అర్థం అవుతుందన్నారు. 

Updated Date - 2022-05-20T04:55:46+05:30 IST