ఏపీలోని 18 ఎన్జీవోలపై ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-12-22T01:51:30+05:30 IST
ఏపీలోని 18 ఎన్జీవోలపై ఎఫ్సిఆర్ఐ(FCRI) నిబంధనల
ఢిల్లీ: ఏపీలోని 18 ఎన్జీవోలపై ఎఫ్సిఆర్ఐ(FCRI) నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులు అందాయని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. లోక్ సభలో ఎంపీ రఘురామ అడిగిన ప్రశ్నకు నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఈ ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. విదేశాలనుంచి పొందిన నిధులతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఎన్జీవోలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.