ఎస్‌ఈసీకి కోడ్ ఉల్లంఘనలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-03-07T14:30:18+05:30 IST

అమరావతి: ఎన్నికల కమిషన్‌కు కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ, మద్యం సరఫరాపై ఈ ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.

ఎస్‌ఈసీకి కోడ్ ఉల్లంఘనలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

అమరావతి: ఎన్నికల కమిషన్‌కు కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ, మద్యం సరఫరాపై ఈ ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కోడ్ ఉల్లంఘనల విషయమై ప్రత్యేక టీంలు పనిచేస్తున్నట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఎస్‌ఈసీ అప్రమత్తమైంది. ఈ ఫిర్యాదులకు సంబంధించి నేటి ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఈ ఫిర్యాదులపై ఆదాయపు పన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2021-03-07T14:30:18+05:30 IST