సంక్షేమ గురుకులాల ఉద్యోగుల సర్దుబాటు పూర్తి
ABN , First Publish Date - 2020-07-07T08:05:48+05:30 IST
సంక్షేమ గురుకులాల ఉద్యోగుల సర్దుబాటు పూర్తి
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన నేపథ్యంలో సంక్షేమ గురుకులాల సంస్థలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పెండింగ్లో ఉద్యోగుల్లో 58.32 శాతం ఆంధ్రప్రదేశ్కు, 41.68శాతం తెలంగాణకు కేటాయించారు. అంటే 87మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ గురుకులాల సంస్థకు, 41.68 శాతం మందిని 64 మంది తెలంగాణ రాష్ట్ర గురుకులాల సంక్షేమ సంస్థకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు ఉద్యోగుల కేటాయింపు జాబితాతో ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా.. వీరిలో చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే పదవీ విరమణ పొందడం కొసమెరుపు.