ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక పూర్తి

ABN , First Publish Date - 2021-07-25T05:47:47+05:30 IST

జిల్లాలోని 36 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ శనివారం నాటికి పూర్తయింది.

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక పూర్తి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 24: జిల్లాలోని 36 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ శనివారం నాటికి పూర్తయింది. జిల్లాలోని 36 ఆదర్శ పాఠశాలల నుంచి మొత్తం 5,933 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఆదర్శ పాఠశాలలో 80 సీట్ల చొప్పున 36 పాఠశాలల్లో మొత్తం 2,880 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. చివరి రోజు శనివారం పెద్దకడుబూరు, కోసిగి, పెద్దపాడు, ఓర్వకల్లు, శిరివెళ్ల, మిడుతూరు, డోన్‌ ఆదర్శ పాఠశాలల్లో లాటరీ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో సాయిరాం, ఏడీ ప్రకాష్‌రెడ్డి, కన్వీనర్లు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T05:47:47+05:30 IST