ముగిసిన ఐసెట్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-09-19T05:10:43+05:30 IST
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తోన్న ఐసెట్ పరీక్షలు శనివారంతో ముగి శాయి.
ఏలూరు
ఎడ్యుకేషన్/భీమవరం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 18: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు
ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తోన్న ఐసెట్ పరీక్షలు శనివారంతో ముగి శాయి.
ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో 168 మంది
విద్యార్థులు, వట్లూరు శ్రీవిద్యాలయ జూనియర్ కళాశాలలో 275 మంది
విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. భీమవరం
ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఉదయం సెక్షన్లో 239
మంది విద్యార్థులకు 219 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెక్షన్లో 243
విద్యార్థులకు 222 మంది విద్యా ర్థులు హాజరయ్యారు.