ముగిసిన టెన్త్‌ వాల్యుయేషన్‌

ABN , First Publish Date - 2022-05-23T05:36:28+05:30 IST

ముగిసిన టెన్త్‌ వాల్యుయేషన్‌

ముగిసిన టెన్త్‌ వాల్యుయేషన్‌

మచిలీపట్నం టౌన్‌, మే 22 : మచిలీపట్నం సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైస్కూల్లో ఈనెల 13 నుంచి జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఆదివారం ముగిసింది. 1,194 మంది ఉపాధ్యాయులు 3 లక్షల 25 వేల 870 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. డీఈవో తాహెరా సుల్తానా, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గూడూరు శ్రీనివాస్‌, లలితామోహన్‌, డీవైఈవో యూవీ సుబ్బారావు, సూపరింటెండెంట్‌ పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మూల్యాంకనం సకాలంలో పూర్తి చేసినందుకు ఉపాధ్యాయులను డీఈవో అభినందించారు.

Updated Date - 2022-05-23T05:36:28+05:30 IST