Krishna District: సర్పంచ్ కుటుంబసభ్యులపై ఎస్పీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-05-18T18:40:05+05:30 IST

గుడివాడ మండలం సెరిదింటకుర్రులో (YCP) వైసీపీ సర్పంచ్ కుటుంబ సభ్యులు హత్య చేసిన బాధిత కుటుంబానికి కొన్నికుటుంబాలు అండగా నిలిచాయి. సర్పంచ్ కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీకి

Krishna District: సర్పంచ్ కుటుంబసభ్యులపై ఎస్పీకి ఫిర్యాదు

కృష్ణాజిల్లా: గుడివాడ మండలం సెరిదింటకుర్రులో (YCP) వైసీపీ సర్పంచ్ కుటుంబ సభ్యులు హత్య చేసిన బాధిత కుటుంబానికి కొన్నికుటుంబాలు అండగా నిలిచాయి. సర్పంచ్ కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో తమ‌పైనే ఫిర్యాదు చేస్తారా? అని సర్పంచ్ కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ కట్ చేశారని సర్పంచ్ ప్రోద్భలంతో నలుగురుపై పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల తీరును నిరసిస్తూ.. గుడివాడ ఎండీవో కార్యాలయం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు.  పంచాయతీ కార్యదర్శి వద్ద ఆధారాలు ఉంటే చూపాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-05-18T18:40:05+05:30 IST