ఎంబీవీకేలో ముగిసిన కంప్యూటర్‌ శిక్షణ

ABN , First Publish Date - 2022-07-03T06:08:40+05:30 IST

ఏ కోర్సు తీసుకున్నా విద్యార్థికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటం తప్పనిసరిగా మారిందని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిస్టరీ లెక్చరర్‌ అజయ్‌బాబు అన్నారు.

ఎంబీవీకేలో ముగిసిన కంప్యూటర్‌ శిక్షణ

ఎంబీవీకేలో ముగిసిన కంప్యూటర్‌ శిక్షణ 

 గవర్నర్‌పేట, జూలై 2: ఏ కోర్సు తీసుకున్నా విద్యార్థికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటం తప్పనిసరిగా మారిందని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిస్టరీ లెక్చరర్‌ అజయ్‌బాబు అన్నారు. ఎంజీ రోడ్డులోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శనివారం కంప్యూటర్‌ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించే కార్యక్రమం జరిగింది. ఎంబీ విజ్ఞాన కేంద్రం ఇన్‌చార్జి బీఆర్‌ తులసీరావు, కంప్యూటర్‌ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ ఎం. ఆనందరావు, ఫ్యాకల్టీ బాలరాజు, ఎంబీవీకే బాధ్యులు యువీ రామరాజు, టి. క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T06:08:40+05:30 IST