5 స్టార్ హోటల్కు ప్రియుడితో కలిసి భోజనానికి వెళ్లిన యువతి.. అక్కడ భోజనం చేస్తూ వారిద్దరూ ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2022-02-14T05:38:05+05:30 IST
వారిద్దరూ ప్రేమికులు. డబ్బున్న వారిని మోసం చేయడమే వారి వృత్తి. ఒకరోజు ఇద్దరూ కలిసి 5 స్టార్ హోటల్కు భోజనానికి వెళ్లారు. అక్కడ భోజనం తిన్నాక వాంతులు చేస్తూ.. 'భోజనంలో ఏదో ఉందని గట్టిగా అరిచారు'...
వారిద్దరూ ప్రేమికులు. డబ్బున్న వారిని మోసం చేయడమే వారి వృత్తి. ఒకరోజు ఇద్దరూ కలిసి 5 స్టార్ హోటల్కు భోజనానికి వెళ్లారు. అక్కడ భోజనం తిన్నాక వాంతులు చేస్తూ.. 'భోజనంలో ఏదో ఉందని గట్టిగా అరిచారు'. ఆ తరువాత వారిద్దరూ హోటల్ ఓనర్ని దోచుకునేందుకు పెద్ద ప్లాన్ వేశారు.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి నగరంలో నివసించే రెన్జీనా, షాజహాన్ అనే ఇద్దరు ప్రేమికులు.. దోపిడీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఒకరోజు ఇద్దరూ కలిసి నగరంలోని ఒక 5 స్టార్ హోటల్కు భోజనానికి వెళ్లారు. అక్కడ భోజనం తిన్నాక వాంతులు చేస్తూ.. 'భోజనంలో ఏదో ఉందని గట్టిగా అరిచారు'. అప్పుడు హోటల్ మేనేజర్ వారిద్దరినీ ఆస్పత్రికి చేర్చాడు. హోటల్ యజమాని తమకు నష్ట పరిహారం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే హోటల్పై కేసు పెడతామని బెదిరించారు.
రెన్జీనా బెదిరింపులకు వారిని కలవడానికి ఆ హోటల్ యజమని ఆస్పత్రికి వచ్చాడు. కానీ ఆ మోసగాళ్లకు డబ్బులిచ్చేదిలేదని అన్నాడు. దీంతో రెన్జీనా, షాజహాన్ ఆ హోటల్ యజమానిపై దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.11,000 దోచుకొని పరారయ్యారు.
ఆ హోటల్ యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో ఇద్దరు మోసగాళ్ల జంటను అరెస్టు చేశారు. వీరిద్దరూ ఇంతకుముందు బడా వ్యాపారులను హనీట్రాప్ చేసి దోచుకున్నారని పోలీసుల విచారణలో తేలింది.