చనిపోకముందే డిపాజిట్లు చెల్లించండి
ABN , First Publish Date - 2021-07-25T07:51:00+05:30 IST
అగ్రిగోల్డ్ డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదని బాధితులు విమర్శించారు
బెజవాడలో అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన
విజయవాడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదని బాధితులు విమర్శించారు. డిపాజిట్లు తిరిగి చెల్లించకపోవడంతో కొందరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని, మరికొందరు ఇతర కారణాలతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించనవసరం లేకుండా మరణించకముందే డిపాజిట్ల సొమ్ము చెల్లించాలని కోరారు. డిపాజిట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ఆందోళన కొనసాగిస్తున్నారు.