కూసుమంచిలో డబుల్‌ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-07T04:51:20+05:30 IST

కూసుమంచిలోని డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. అధికారికంగా ఇళ్లకేటాయింపు ఆలస్యం చేస్తుండటంతో విసిగిన అర్ధరాత్రి అనధికారికంగా గృహప్రవేశాలు చేశారు.

కూసుమంచిలో డబుల్‌ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన
రాస్తారోకో చేస్తున్న లబ్ధిదారులు

 ఇళ్లను కేటాయించాలంటూ రాస్తారోకో

 ఖమ్మం-సూర్యాపేట జాతీయ

     రహదారిపై నిలిచిన రాకపోకలు

కూసుమంచి, జూన్‌ 6: కూసుమంచిలోని డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. అధికారికంగా ఇళ్లకేటాయింపు ఆలస్యం చేస్తుండటంతో విసిగిన అర్ధరాత్రి అనధికారికంగా గృహప్రవేశాలు చేశారు. దీంతో బుధవారం ఉదయం తహసీల్దార్‌ ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆక్రమణ చేసుకున్న ఇళ్లను ఖాళీచేయించారు. ఈక్రమంలో లబ్దీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఖమ్మం-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్‌మీనన్‌, ఎస్‌ఐ నందీప్‌ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు.  వారం రోజులపాటు సమయం ఇవ్వాలని నిజమైన లబ్ధిదారులను ఎంపికచేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2022-07-07T04:51:20+05:30 IST