టీటీడీ బోర్డు ఎదుట భక్తుల ఆందోళన
ABN , First Publish Date - 2021-12-26T01:12:11+05:30 IST
టీటీడీ బోర్డు సెల్ కార్యాలయం ఎదుట భక్తులు
తిరుమల: టీటీడీ బోర్డు సెల్ కార్యాలయం ఎదుట భక్తులు ఆందోళన చేశారు. శ్రీవారి దర్శనం చేయిస్తానని బోర్డు మెంబర్ విశ్వనాథ్రెడ్డి పీఆర్వో మారుతి తమను మోసం చేశారని భక్తులు ఆరోపించారు. 85 మందికి దర్శనం చేయిస్తానని 25 వేలు నగదు తీసుకుని దర్శనం చేయించలేదంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందితో భక్తులకు వాగ్వాదం జరిగింది.