కాళోజి వైద్య విశ్వవిద్యాలయం ముందు పీజీ డాక్టర్ల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-29T19:29:58+05:30 IST
కాళోజి వైద్య విశ్వవిద్యాలయం ముందు పీజీ డాక్టర్లు బుధవారం ఆందోళనకు దిగారు.
వరంగల్: కాళోజి వైద్య విశ్వవిద్యాలయం ముందు పీజీ డాక్టర్లు బుధవారం ఆందోళనకు దిగారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పీజీ సీట్లు రద్దు చేయడంతో ఎంఎన్ఆర్, మహావీర్ కాలేజీ విద్యార్థులు విశ్వవిద్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇతర వైద్య కళాశాలలో భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. వీసీ ఛాంబర్ను వైద్య విద్యార్థులు ముట్టడించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పీజీ సీట్లు రద్దుతో 139 విద్యార్థులు భవిష్యత్తు అంధకారంలో పడనుందని, నేషనల్ మెడికల్ కౌన్సిల్ భర్తీ చెయ్యాలని ఉత్తరాలు జారీచేసిన వైద్య విశ్వవిద్యాలయం పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు.