భూమి కబ్జా చేశారని ఆందోళన
ABN , First Publish Date - 2022-05-22T05:24:42+05:30 IST
కొంత మంది నాయకులు తన భూమి కబ్జా చేశారంటూ తంగళ్లపల్లి మండలం గోపాల్రావ్పల్లె గ్రామానికి చెందిన జనగం నర్సవ్వ కుటుంబం తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగింది.
తంగళ్లపల్లి, మే 21: కొంత మంది నాయకులు తన భూమి కబ్జా చేశారంటూ తంగళ్లపల్లి మండలం గోపాల్రావ్పల్లె గ్రామానికి చెందిన జనగం నర్సవ్వ కుటుంబం తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగింది. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 22 సంవత్సరాల క్రితం 3 ఎకారాల భూమిని కోనుగోలు చేశామని, అప్పటి నుంచి కాస్తులో ఉన్నామని అన్నారు. ఇప్పటికే శ్మశాన వాటిక కోసమని బలవంతంగా పది గుంటల స్థలాన్ని తీసుకున్నారన్నారు. కొంత మంది టీఆర్ఎస్ నాయకులు 20 గుంటల భూమిని కబ్జా చేసి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం చేయాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సదానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తహసీల్దార్ను వివరణ కోరగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.