కొవిడ్ టెస్ట్ల కోసం విద్యార్థుల అవస్థలు
ABN , First Publish Date - 2022-01-18T05:33:44+05:30 IST
కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాల నుంచి విద్యార్థులు వసతి గృహాలకు వెళ్తున్నారు.
హిందూపురం టౌన, జనవరి 17: కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాల నుంచి విద్యార్థులు వసతి గృహాలకు వెళ్తున్నారు. అయితే అక్కడి విద్యాసంస్థలు కొవిడ్ పరీక్షలు చేయించుకుని వస్తేనే వసతి గృహాల్లో అనుమతిస్తామని తెగేసి చెప్పడంతో విద్యార్థులు పరీక్షల కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రతిరోజూ వంద నుంచి 200 మంది విద్యార్థులు కొవిడ్ టెస్ట్ కోసం వస్తున్నారు. వారిలో నలుగురు, ఐదుగురు మినహా మిగిలిన వారికి నెగిటివ్ వస్తోంది. దీంతో టెస్టింగ్ కిట్లు వృధా అవుతాయని ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని వైద్యాధికారులు అంటున్నారు. ప్రైవేట్లో చేయించుకుందామంటే అక్కడ పరీక్షలు చేయరని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సహకరించడం లేదని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం లక్షణాలుంటేనే టెస్ట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయంటూ వైద్యులు పేర్కొంటున్నారు. కానీ వసతి గృహాల్లో ఎందుకు టెస్టింగ్ సర్టిఫికెట్ అడుగుతున్నారో అర్థం కాలేదని వైద్యులు అంటున్నారు.