కరోనా కేసుల వెల్లడిలో గోప్యత
ABN , First Publish Date - 2021-04-24T05:19:19+05:30 IST
జిల్లాలో ప్రతీ రోజు 300లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా వివరాలను జిల్లా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 23: జిల్లాలో ప్రతీ రోజు 300లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా వివరాలను జిల్లా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. శుక్రవారం ములుగు మండలంలోని ములుగు పీహెచ్సీలో 15, సింగన్నగూడెం పరిధిలో 12, చిన్నకోడూరు పీహెచ్సీలో 4, ఇబ్రహింనగర్ పీహెచ్సీలో 4, లద్నూరు పీహెచ్సీలో 1, మద్దూరు పీహెచ్సీలో 3 కేసులు నమోదయ్యాయి.
చేర్యాల: చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో 15మందికి, కొమురవెల్లి పీహెచ్సీ పరిధిలో 22 మందికి కరోనా సోకినట్లు నమోదయ్యాయి.
పాజిటివ్ వచ్చిన ఇద్దరు గుండెపోటుతో మృతి
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని 14వ వార్డు, 3వ వార్డుకు చెందిన ఇద్దరు వ్యాపారులు కరోనా సోకడంతో హైద్రాబాద్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం గుండె పోటు రావడంతో అక్కడే మృతిచెందారు.