APNews: పెనుమంట్రలో ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2022-06-17T14:58:25+05:30 IST

జిల్లాలోని పెనుమంట్ర మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

APNews: పెనుమంట్రలో ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య వాగ్వాదం

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెనుమంట్ర మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీటింగుల గురించి సమాచారం ఇవ్వడంలేదని ఎంపీడీవోపై వైసీపీ ఎంపీపీ మండిపడ్డారు. ‘‘నేను మండల పరిషత్ అధ్యక్షుడు నేనా అనే అనుమానం కలుగుతుంది. సర్వసభ్య సమావేశం గురించి గాని అజెండా గురించి గాని ఎంపీడీవో ఎప్పుడూ చర్చించలేదు. నన్ను ఎంపీపీగా ఎప్పుడూ ఆయన గుర్తించలేదు. ఎమ్మెల్యే రంగనాథ్ రాజు కంటే  ఇన్‌చార్జ్ ఎంపీడీవో సుప్రీమ్’’ అంటూ  ఎంపీపీ కర్రీ వెంకట నారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-17T14:58:25+05:30 IST