వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2021-08-08T00:46:21+05:30 IST
జిల్లాలోని వైసీపీలోగల ఇరువర్గాల మధ్య ఉన్న అంతర్గత లుకలుకలు మరోసారి
ప్రకాశం: జిల్లాలోని వైసీపీలోగల ఇరువర్గాల మధ్య ఉన్న అంతర్గత లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. చీరాల మండలం గవినివారిపాలెం వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఎదుటే అనుచరులు కొట్టుకున్నారు. వైసీపీ నేత బుర్ల మురళీ, మాజీ ఏంపీపీ గవిని శ్రీను వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బుర్ల మురళీపై గవిని శ్రీను అనుచరులు దాడి చేసారు. ఎమ్మెల్యే కరణం బలరాం వైద్యశిబిరంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.