వైసీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2022-01-29T22:50:28+05:30 IST

జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి పంచాయతీ సమావేశంలో

వైసీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం

గుంటూరు: జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి పంచాయతీ సమావేశంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. గ్రామ సమావేశం వద్దకు సర్పంచి భర్త ఆళ్ల శ్రీను వచ్చాడు. రెండో వర్గానికి చెందిన దాసరి శ్రీశైలం సైతం సమావేశం వద్దకు వచ్చాడు. దీంతో సమావేశానికి బయట వ్యక్తులు ఎందుకు వస్తున్నారని వార్డు సభ్యులు ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం చెలరేగింది. పంచాయతీ బయటకు వచ్చాక రెండు వర్గాల మహిళా వార్దు సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ పంచాయతీ చివరకు పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-29T22:50:28+05:30 IST