శ్రీకాళహస్తీశ్వరాలయంలో రద్దీ

ABN , First Publish Date - 2021-01-17T04:23:40+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండం... వారాంతం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో రద్దీ
రాహు-కేతు పూజల కోసం వేచివున్న భక్తులు

శ్రీకాళహస్తి, జనవరి 16: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండం... వారాంతం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేసుకోవడానికి బారులు తీరారు. కొవిడ్‌ నేపథ్యంలో తిరుమంజన గోపురం ద్వారా భక్తులను అనుమతించలేదు. భద్రతా కారణాలతో శివయ్య గోపురం కూడా మూసేశారు. దీంతో భక్తులందరూ బిక్షాలగాలిగోపురం ద్వారా ఆలయం లోపలకు రావాల్సి వస్తోంది. ఇక ప్రముఖులు దక్షిణ గోపురం ద్వారా ఆలయంలోకి వస్తున్నారు. రద్దీ సమయంలో ఆలయ ప్రవేశ మార్గాలు మూసివేసి భక్తులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల భక్తుల నుంచి  విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-01-17T04:23:40+05:30 IST