టీడీపీ జెండాను ఎగురవేయాలి: బీసీ
ABN , First Publish Date - 2022-05-22T06:17:19+05:30 IST
కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో నాయకులు కలసికట్టుగా పనిచేసి టీడీపీ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి కోరారు.
బనగానపల్లె/డోన్, మే 21: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో నాయకులు కలసికట్టుగా పనిచేసి టీడీపీ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి కోరారు. డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డిని ఆయన బనగానపల్లెలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీని కలసి శాలువా, పూలమాలలతో సత్కరించి ధర్మవరం సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. డోన్ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో బీసీ పార్టీ అభివృద్ధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కార్యక్రమంలో డోన్ నియోజకవర్గం యువనాయకుడు మన్నె గౌతమ్రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, బీసీ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున, బుగ్గన ప్రసన్నలక్ష్మి, మల్లికార్జున, గండికోట రామసుబ్బయ్య, కమలాపురం సర్పంచ్ అర్జున్రెడ్డి, ప్యాపిలి మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్, అభిరెడ్డిపల్లె గోవింద్, షేక్షావలి, తిరుమలేశ్ చౌదరి, శేఖర్, రాముడు, రూబెన్, మేకలనాగరాజు, గోవిందరెడ్డి, మధుసూధన్రెడ్డి, రామాంజనేయులు, ఆనందరెడ్డి, హుస్సేన్పీరా తదితరులు పాల్గొన్నారు.