ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందన

ABN , First Publish Date - 2022-07-03T05:57:24+05:30 IST

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందన

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందన
షాద్‌నగర్‌ అర్బన్‌: కీర్తనను అభినందిస్తున్న మంత్రి కొప్పుల

షాద్‌నగర్‌ అర్బన్‌/ కడ్తాల్‌ /నందిగామ, జూలై 2: పదోతరగతిలో 10/10 జీపీఏ సాధించిన కీర్తనను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభినందించారు. రాంచంద్రయ్య కుమార్తె కీర్తన గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఇటీవల వెలువడిన పదోతరగతి పరీక్షల్లో కీర్తన 10జీపీఏ సాధించడంతో శనివారం పాఠశాలకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌ రోష్‌లు అభినందించారు. అదేవిధంగా మైసిగండి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ శంకర్‌లక్ష్మిల కూతురు వి.అనూష పదో తరగతిలో 10జీపీఏ సాధించింది. శనివారం మైసిగండిలో వార్డుసభ్యుడు, బీజేపీ నాయకుడు రాందాస్‌ నాయక్‌ ఆధ్వర్యంలో అనూష కు అభినందనలు తెలిపి సత్కరించారు. అదేవిధంగా నందిగామ ండలం వెంకమ్మగూడ, చేగూర్‌ గ్రామాలకు చెందిన మనోజ్ఞ, శివకుమార్‌, శిరీష, భవానీలు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించగా కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు సతీష్‌, బుచ్చయ్య, మంకా శ్రీశైలం, శివ, రాజఖేఖర్‌, సాములయ్య, శ్రీను, శ్రావణ్‌, మహేష్‌, మరళి పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-03T05:57:24+05:30 IST