నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-02T06:09:22+05:30 IST

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఏవోకు వినతి పత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 1 : నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని విజయవాడ రూరల్‌ డీసీసీ అధ్యక్షుడు బొర్రా కిరణ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈలప్రోలులో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏవో శైలజకు వినతి పత్రం అందజేశారు. పీసీసీ కార్యదర్శి పోతురాజు ఏసుదాసు, దొప్పలపూడి శ్రీనివాసరావు, అక్కల నాగేంద్రప్రసాద్‌, గొంది సురేష్‌, చెరుకు ఆనందరావు, రాగాల రాము, చిట్టిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T06:09:22+05:30 IST