కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు ఒక్కటే

ABN , First Publish Date - 2022-08-09T07:00:17+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు ఒక్కటే
మాట్లాడుతున్న సంకినేని వేంకటేశ్వరరావు

సూర్యాపేట సిటీ, ఆగస్టు 8: రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు  చేయకుండా టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో ఏం మాట్లాడని రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం నీతి మాటలు చెప్పడం సిగ్గు  చేటన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజీనామాతో  సీఎం కేసీఆర్‌కు సంక్షేమ పథకాలు గుర్తుకు వచ్చాయని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో రావాలని తాము రాజగోపాల్‌రెడ్డిని కోరామన్నారు.   కొద్దిరోజుల్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి భారీగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేయడానికి సన్నద్ధం అవుతున్నారన్నారు. మూసీ ఇసుక మాఫియాలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, వెంకన్నయాదవ్‌కు భాగం ఉందని, ఈ ఇద్దరికీ  తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ ప్రతీ నెలా భారీగా ముడుపులు ఇస్తున్నాడని ఆయన ఆరోపించారు. సమావేశంలో  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, అబీద్‌, మీర్‌ అక్బర్‌,  ఉపేందర్‌, శివ, వెంకన్న పాల్గొన్నారు.




Updated Date - 2022-08-09T07:00:17+05:30 IST