కాంగ్రెస్‌లో ఇంటి దొంగలు ఉన్నారు: అంజన్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-03-09T22:20:09+05:30 IST

కాంగ్రెస్‌లో కొందరు ఇంటి దొంగలు ఉన్నారని ఆ పార్టీ నేత అంజన్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌లో ఇంటి దొంగలు ఉన్నారు: అంజన్‌కుమార్‌

హైదరాబాద్: కాంగ్రెస్‌లో కొందరు ఇంటి దొంగలు ఉన్నారని ఆ పార్టీ నేత అంజన్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటి దొంగలతో పార్టీకి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం  చేశారు. కాంగ్రెస్ అధినేత సోనియా లేకుంటే సీఎం కేసీఆర్ 10 జన్మలు ఎత్తినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ప్రజల కల సాకారం అయిందని అంజన్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-03-09T22:20:09+05:30 IST