వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు: గీతారెడ్డి
ABN , First Publish Date - 2022-06-30T01:38:31+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యలపై మాజీ మంత్రి గీతారెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట మైనార్టీ గురుకులంలో కల్తీ ఆహారం ప్రభుత్వ వైఫల్యమేనని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యలపై మాజీ మంత్రి గీతారెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట మైనార్టీ గురుకులంలో కల్తీ ఆహారం ప్రభుత్వ వైఫల్యమేనని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం బయటకు రాకుండా దాచారని ఆమె ఆరోపించారు. 3 రోజులు వందలాది మంది పిల్లలు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి విషమించడంతోనే ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని వసతిగృహాల్లో ఇదే పరిస్థితి నెలకొందని గీతారెడ్డి పేర్కొన్నారు.