కెప్టెన్ సింగ్ రాజీనామాకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం?
ABN , First Publish Date - 2021-09-18T18:53:52+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ను ఆ పదవికి
న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ను ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం శనివారం సాయంత్రం జరగబోతున్న తరుణంలో అధిష్ఠానం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా మరో నేతను ఎన్నుకునేందుకు వీలుగా రాజీనామా చేయాలని కెప్టెన్ సింగ్ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడారని, తనను అవమానిస్తున్నందు వల్ల తాను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినట్లు తెలిసింది.
మరోవైపు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఒకనాటి సహచరుడు, పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జక్కర్ను ముఖ్యమంత్రి పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.