Telangana: ఇక నుంచి రంగంలోకి ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2022-08-23T03:43:40+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఇక నుంచి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నిశితంగా పర్యవేక్షించనున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ ..

Telangana: ఇక నుంచి రంగంలోకి ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఇక నుంచి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నిశితంగా పర్యవేక్షించనున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి (TPCC campaign committee chairman Madhuyashki) అన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానంతరం మధుయాష్కి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రియాంకగాంధీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పినట్లు తెలిపారు. ‘‘మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారు. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ముందుగా అభ్యర్థి ఎంపిక మీద అధిష్టానం దృష్టి పెట్టింది. నేతల మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు మినహా విభేదాలు లేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నేను దామోదర రాజనర్సింహ వెళ్లి కలిసి మాట్లాడతాం.’’ అని అన్నారు. 


Updated Date - 2022-08-23T03:43:40+05:30 IST