టీ కాంగ్రెస్ దేశంలో నెంబర్వన్గా నిలిసింది: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-03-04T23:28:34+05:30 IST
రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ కాంగ్రెస్ దేశంలో నెంబర్వన్గా నిలిసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ కాంగ్రెస్ దేశంలో నెంబర్వన్గా నిలిసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ్యత్వం చేసినవారికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ పర్యవేక్షణ కోసం పార్టీలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్కి భయపడి వ్యూహకర్త పీకేను తెచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనడానికి ఇదే తార్కాణమన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.