కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్ తయారయ్యింది: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-01-02T23:45:01+05:30 IST

కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్ తయారయ్యిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్ తయారయ్యింది: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్ తయారయ్యిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను డిస్టర్బ్ చేస్తున్నది ఆ పిచ్చి అభిమాన సంఘాలేనని విమర్శించారు. టీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకుంటే తననెవరూ ఆపరేరని చెప్పారు. పీసీసీ అనే వాడు కాంగ్రెస్‌కు డ్రైవర్ లాంటివాడని చెప్పారు. తప్పులు సరిదిద్దుకోమని చెబితే కూడా తప్పా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనను ఏజెంట్ అనడానికి తీన్మార్ మల్లన్న ఎవరు? అని ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన తాను కోవర్ట్‌ను అయితే.. ఆయన్ను కలిసిన రేవంత్‌రెడ్డి కూడా కోవర్టే అని ఆరోపించారు. తనపై దుష్ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్‌ ఎందుకు ఖండించరని జగ్గారెడ్డి నిలదీశారు. కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఉంటా.. కాంగ్రెస్‌లోనే జీవిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


‘‘నాకు గులాబీ కండువా కప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. నా నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి కేటీఆర్ వచ్చారు. నియోజకవర్గ సమస్యలపై కేటీఆర్‌కు వినతిపత్రం ఇచ్చాను. మా ఇద్దరి పార్టీలు వేరైనా ఎదురుపడ్డప్పుడు పలకరించుకోవడం సంస్కారం. దీనిపై కూడా కొన్ని అభిమాన సంఘాలు రాద్ధాంతం చేస్తున్నాయి. గతంలో ఎవరూ కేటీఆర్‌ను కలవలేదా? నేను కేసీఆర్ ఏజెంట్‌ అని రెండు యూట్యూబ్ చానల్స్ రాశాయి. ఆ రెండు చానల్స్‌ రేవంత్‌ను ఏమైనా అంటే ఊరుకోవని నాకు తెలుసు’’ జగ్గారెడ్డి ఆరోపించారు.

Updated Date - 2022-01-02T23:45:01+05:30 IST