Addanki dayakar: మర్రిశశిధర్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలి
ABN , First Publish Date - 2022-08-18T15:22:53+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డిపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి (Marri shashidharreddy)పై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ (Addanki dayakar) మండిపడ్డారు. పీసీసీ (PCC)పై ఠాగూర్ (Tagore)పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవుపలికారు. పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. తాము చేసిన కామెంట్స్ పెద్దగా చేయకుండా సద్దుమణిగే విధంగా ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్ (RSS) చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పావులుగా మారుతున్నట్టు ఉందన్నారు. ‘‘మీరు మాట్లాడితే కాదు అనేవారు ఎవరు లేరు. అంతర్గత అంశాల మీద మీరే సలహాలు ఇవ్వాలి కానీ పీసీసీని ఇలా అంటే పార్టీకి నష్టం కాదా. ఏదన్నా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఉంది. ఏఐసీసీ డీసీపీలినరీ కమిటీ ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నన్ను కూడా మీరు అన్నందుకు స్పందిస్తున్న. రేవంత్ (Revanth reddy) చెప్తే నేను స్పందించడం లేదు’’ అంటూ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.