TRS-BJP ఒకటే.. కిషన్ రెడ్డికి సవాల్..!

ABN , First Publish Date - 2021-08-23T12:09:20+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పే బీజేపీ నేతలు...

TRS-BJP ఒకటే.. కిషన్ రెడ్డికి సవాల్..!

హైదరాబాద్ సిటీ : టీఆర్‌ఎస్-బీజేపీ ఒక్కటేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పే బీజేపీ నేతలు ఎందుకు వాటిని బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్న సమయంలో ఎలాగైనా అడ్డుకోవాలని టీఆర్‌ఎ్‌స-బీజేపీ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్‌ అవినీతి కుంభకోణాలకు అండగా ఉంటోందని, కేవలం ప్రజలను నమ్మించడానికే ఇక్కడ ఇరు పార్టీల నేతలు విమర్శించుకున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని, కేసీఆర్‌ కుటుంబ అవినీతి కార్యకలాపాలను బయటపెట్టి అప్పుడు యాత్రలు చేయాలని ఆయన కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

Updated Date - 2021-08-23T12:09:20+05:30 IST