Congress leader విగ్రహం మాయం
ABN , First Publish Date - 2022-08-29T15:49:22+05:30 IST
బాలానగర్ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పీజేఆర్ వీరాభిమాని స్వర్గీయ బండారి ప్రకా్షగౌడ్ విగ్రహం
బాలానగర్ సీఐకి ఫిర్యాదు
హైదరాబాద్/బాలానగర్: బాలానగర్ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పీజేఆర్ వీరాభిమాని స్వర్గీయ బండారి ప్రకా్షగౌడ్ విగ్రహం మాయం అయింది. హెచ్ఎండీఏ అనుమతితో కమాన్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే రాత్రికి రాత్రే ఆ విగ్రహాన్ని అధికార పార్టీ నాయకులే మాయం చేశారని కూకట్పల్లి కాంగ్రెస్ ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు యం. యుగంధర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలిసి బాలానగర్ కమాన్ వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రకా్షగౌడ్ విగ్రహం మాయం అయిన విషయం తెలుసుకున్న ఏ బ్లాక్ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, సీనియర్ నాయకుడు సత్యంశ్రీరంగం, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పుష్పారెడ్డి మరికొందరు నాయకులు బాలానగర్ సీఐ కె.భాస్కర్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నవీన్గౌడ్, రాజుముదిరాజ్, మల్లికార్జున్, మట్టి ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.