Janareddy: టీఆర్ఎస్ పాలనపై జనంలో నమ్మకం పోయింది

ABN , First Publish Date - 2022-09-03T20:21:06+05:30 IST

టీఆర్‌ఎస్ పాలనపై జనంలో నమ్మకం పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.

Janareddy: టీఆర్ఎస్ పాలనపై జనంలో నమ్మకం పోయింది

నల్గొండ: టీఆర్‌ఎస్(TRS) పాలనపై జనంలో నమ్మకం పోయిందని కాంగ్రెస్(Congress) సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్టు పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేక ప్రమాదంలో చిక్కుకుందని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనలను ప్రజలు గుర్తు చేసుకొని ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ అంశాలపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు.  మునుగోడు(Munugodu by poll) సీటు గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ (BJP)లు తహతహలాడుతున్నాయని... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని జానారెడ్డి కోరారు. 

Updated Date - 2022-09-03T20:21:06+05:30 IST