TS News: టీఆర్ఎస్, బీజేపీ అనైతిక పాలన చేస్తున్నాయి: మహేష్ గౌడ్

ABN , First Publish Date - 2022-08-09T16:16:40+05:30 IST

: ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీతో బ్రిటీష్ వారు పాలించారని... ఈనాడు వెస్ట్ ఇండియా కంపెనీలతో మోదీ దేశాన్ని పాలిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు.

TS News: టీఆర్ఎస్, బీజేపీ అనైతిక పాలన చేస్తున్నాయి: మహేష్ గౌడ్

హైదరాబాద్: ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీతో బ్రిటీష్ వారు పాలించారని... ఈనాడు వెస్ట్ ఇండియా కంపెనీలతో మోదీ దేశాన్ని పాలిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ (Mahesh goud) విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్‌లో క్విట్ ఇండియా దినోత్సవంలో భాగంగా మహేష్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (TRS), బీజేపీ(BJP) అనైతిక పాలన చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన  ఎమ్మేల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో వెస్ట్ ఇండియా కంపెనీ పాలన చేస్తున్న మోదీని..  రాష్ట్రంలో కేసీఆర్‌ను పారద్రోలాలని అన్నారు. క్విట్ బీజేపీ, క్విట్ టీఎర్ఎస్ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మతం పేరుతో ఒకరు, ప్రాంతం పేరుతో ఒకరు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నారని... వారిని గద్దె దించడానికి కాంగ్రెస్ మరో ఉద్యమానికి సిద్దం కావాలని మహేష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ యాదవ్(Anjankumar yadav), రోహిన్ రెడ్డి (Rohin reddy), కుమార్ రావు (Kumar rao), నిరంజన్ (Niranjgan), నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. 

Updated Date - 2022-08-09T16:16:40+05:30 IST