ఒక రాష్ట్రం.. ఒక రాజధాని కాంగ్రెస్ సిద్ధాంతం: నరహరశెట్టి
ABN , First Publish Date - 2020-12-02T18:31:51+05:30 IST
ఒక రాష్ట్రం.. ఒక రాజధాని కాంగ్రెస్ సిద్ధాంతమని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు స్పష్టం చేశారు.
విజయవాడ: ఒక రాష్ట్రం.. ఒక రాజధాని కాంగ్రెస్ సిద్ధాంతమని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు స్పష్టం చేశారు. అమరావతి మూడు రాజధానుల ప్రకటన తర్వాత నుంచి రైతులకు, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సంఘీభావం తెలియజేస్తున్నామని తెలిపారు. జాతీయ స్థాయిలోకి ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లాలనే సిద్ధాంతంతో అమరావతి కాంగ్రెస్ జేఏసీ ఏర్పాటు అయినట్లు చెప్పారు. మోదీ చేసిన శంకుస్థాపన ప్రదేశంలో గొప్ప సదస్సు నిర్వహించామని తెలిపారు. 5 కోట్ల ఏపీ ప్రజల ఆకాంక్ష కొరకు సాకే శైలజానాధ్ ఆధ్వర్యంలో ఈ నెల 5న సీఎంను కలువనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలలో ఒక ప్రచారం అధికారంలో ఇంకో ప్రచారమని విమర్శించారు. ప్రత్యేక హోదాని ఏపీ ప్రజలు మర్చిపోడానికి అమరావతిని వైజాగ్కు తరలిస్తున్నారని ఆరోపించారు. 3రాజధానులు వద్దు అమరావతి ముద్దు అన్న మాటకి కట్టుబడి ఉంటామని నరహరశెట్టి స్పష్టం చేశారు.