Nallala odelu: మినిస్టర్ క్వార్టర్స్‌లో నల్లాల ఓదెలు ఇళ్లు బలవంతంగా ఖాళీ

ABN , First Publish Date - 2022-09-14T16:01:33+05:30 IST

నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు.

Nallala odelu: మినిస్టర్ క్వార్టర్స్‌లో నల్లాల ఓదెలు ఇళ్లు బలవంతంగా ఖాళీ

హైదరాబాద్: నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ నేత (Congress), చెన్నూరు మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు (nallala odelu) ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. గతంలో ఓదెలు ప్రభుత్వ విప్ ఉండగా క్వార్టర్స్‌లో ప్రభుత్వం (Telangana government) ఇంటిని కేటాయించింది. ప్రస్తుతం ఆ ఇంటిలోనే ఓదెలు(Congress leader) ఉంటున్నారు. టీఆర్ఎస్ (TRS) పార్టీలో ఉన్నంత వరకు క్వార్టర్స్‌లోనే ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు అవకాశం ఇచ్చారు. కాగా... ఇటీవల ఓదెలు ఆయన భార్య జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. దాంతో వారు వెంటనే క్వార్టర్ ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తాము ఇంట్లో లేని సమయంలో కొందరు అధికార పార్టీ నేతలు వచ్చి ఇంట్లో హంగామా చేసి వెళ్లారని ఓదెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఆదేశాలతో మినిస్టర్ క్వార్టర్స్‌లో ఇల్లును ఓదెలు కుటుంబ సభ్యులు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతం ఓదెలు మందమర్రిలో ఉన్నారు. కాగా... ప్రభుత్వ తీరుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-14T16:01:33+05:30 IST